రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముందు కూర్చున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీటు బెల్ట్ పెట్టుకోలేదని .. అందుకే ఆయన చాతికి, తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.