పవన్ ‘బ్రో’ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో రాబోతున్న చిత్రం బ్రో. జూన్ 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో చిత్రంలోని మొదటి సాంగ్ ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే ఈ సాంగ్ ను రేవంత్ స్నిగ్ధ శర్మ ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. గణేష్ స్వామి భాను కొరియోగ్రఫీ అందించారు. ప్రత్యేకంగా నిర్మించిన ఒక భారీ పబ్ సెట్ లో ఈ పాట చిత్రీకరించబడింది. టైమ్ జీవితం గురించి లోతైన భావంతో ఈ పాట సాగింది.

“మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..” అనే లైన్స్ ఆలోచింప జేసేలా ఉన్నాయి. ఒక విధంగా పవన్ వ్యక్తిత్వానికి రోల్ కు పర్ఫెక్ట్ గా సెట్టయ్యేలా ఈ సాంగ్ ఉంది. ఇక సాంగ్ లో హాట్ బ్యూటి ఊర్వశి రౌతేలా చిందులేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటించారు. జూలై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. మీరు కూడా ఈ ఫస్ట్ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video