బిఆర్ఎస్తో బిజెపి పొత్తు..స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శ
హైదరాబాద్ః రాష్ట్రంలోని అధికార బిఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి మధ్య సయోధ్య కుదిరిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్తో బిజెపి ఇప్పటి వరకూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. వందలాది మంది బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం పాలైందన్నారు. సీఎం కెసిఆర్ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకుందని ఆరోపించారు. ఆ డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని అనుకుంటోందని విమర్శించారు.
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అవినీతిమయం అయిందన్నారు. బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బిజెపినే నిలబడుతుందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్లు మళ్లీ బిఆర్ఎస్ లో చేరుతారన్నారు. బిజెపితోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.