సీఎం రేవంత్ రెడ్డి కి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ..సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. శబరిమలకు భక్తుల తాకిడి పెరిగిన ఈ సమయంలో కేరళ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై విపక్షాలు మండిపడుతున్నాయి. మౌలిక వసతులు లేకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్పస్వాములకు అన్నప్రసాదం చేద్దామన్నా కేరళ ప్రభుత్వం అనుమతించడం లేదని , కనీసం తాగునీరు, పార్కింగ్‌ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని, కేరళ సీఎంతో మాట్లాడి భోజన వసతి, తాగునీటి సదుపాయం కల్పించాలని అన్నారు. ఢిల్లీ తరహాలో కేరళలో కూడా తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇందు కోసం ఐదు నుంచి పదిహేను ఎకరాల స్థలం తీసుకోవాలన్నారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే అక్కడ స్వాములు బస చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.