ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారుః రఘునందనరావు

raghunandan-rao

హైదరాబాద్‌ః కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన రావు ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాదులోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారన్నారు. 2008లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు చెప్పారు. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.