‘ఏపీ’ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బిజెపి చేస్తుంది – కేసీఆర్
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్..బిజెపి చేస్తున్న కుట్రలను బయటపెట్టారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిపిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వీడియోలను బయటపెట్టడమే కాదు. బిజెపి సంచలన ఆరోపణలు చేసారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేశారని.. ఇప్పుడు మరో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని ఆరోపించారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ రాష్ట్రం కూడా ఉందని కేసీఆర్ సంచలన విషయం బయటపెట్టారు. కేవలం తెలంగాణలోనే కాకుండా.. వేరే రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కూల్చే కుట్ర బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసే కుట్ర జరిగిందని ఆయన అన్నారు.
ఒకనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే.. అందరం కలిసి పోరాటాలు చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. అయితే.. గోడీ.. లేకపోతే ఈడీ అంటూ బీజేపీ బరితెగిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలోని న్యాయవ్యవస్థకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. దేశాన్ని రక్షించండి అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధోరణితో బీజేపీ ముఠా ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరికట్టబడాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ ఒక్కరికి, దేశం ఉనికికి మంచిది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం. గతంలో అలానే ఇచ్చాం. ఇది మాకు నిత్య కృత్యమే. మిగతావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తమని చెప్తరు. సెంట్రల్ సెక్యూరిటీ వై కేటగిరి ఇస్తమని చెప్తరు. రాజ్యాంగేతర శక్తుల్లో భారత ప్రభుత్వం ఉంది. ఈ వీరవిహారం అరికట్టబడకపోతే అందరికీ ప్రమాదమే. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ ఖండించాలి అన్నారు.