ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం
అమరావతిః రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానున్నాయని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో జగన్మాత దుర్గమ్మ ఉత్సవమూర్తిని వేద పండితులు శాస్త్రోకంగా ప్రతిష్టించి దీక్షలను ప్రారంభిస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు .
రేపటి నుంచి ఈనెల 8 వరకు మండల దీక్షలను స్వీకరించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు అర్ధమండల దీక్షలను దీక్షాదారులు స్వీకరించాలని సూచించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు దీక్షల విరమణ దేవస్థానం నిర్వహిస్తుందన్నారు. స్వాములు ఏ తేదీల్లో విరమణ చేస్తారో వారి గురుభవానీల ద్వారా దేవస్థానానికి తెలియజేయాలని పేర్కొన్నారు.
డిసెంబర్ 7న పౌర్ణమి రోజున దేవస్థానం ఆధ్వర్యంలో కలశజ్యోతుల ఊరేగింపు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రికి చేరేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. డిసెంబర్ 19 న పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షల విరమణ ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/