పవన్ కళ్యాణ్ కు ఏదైనా’ 3 ‘ కావాలంటూ వైసీపీ నేత సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏదైనా ‘3 ‘ కావాలంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేసారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో ఉంటె..ప్రతిపక్ష పార్టీ లు రాష్ట్ర వ్యాప్త టూర్ లతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు లపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడు.. చంద్రబాబుకు సిగ్గుందా.. చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోందన్నారు. కట్టె కాలిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది?? తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాడు.. తన కంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఇంత అద్భుతంగా చేస్తుంటే చంద్రబాబు చూడలేక పోతున్నాడన్నారు.

నలుగురు సహాయంగా వస్తే తప్పించి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. జగన్ ను తిట్టేస్తే ఇవాళ ప్రశాంతంగా పొడుకోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబుదని వెల్లడించారు. విశాఖను రాజధానిగా చంద్రబాబు అంగీకరిస్తున్నాడో లేదో చెప్పాలి.. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు విశాఖకు ఏం చేశాడని నిలదీశారు. కుప్పంలో ప్రజలు ఎందుకు తిరగబడ్డారు చంద్రబాబు చెప్పాలి.. రాజకీయాల్లో ఎవరు బచ్చానో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. జనసేనను రాజకీయ పార్టీగానే పరిగణించటం లేదని , పవన్ కళ్యాణ్ కు ఏదైనా మూడు కావాలంటూ ఎద్దేవా చేసారు.