ప్రధాని మోడీకి భట్టి బహిరంగ లేఖ..

ప్రధాని మోడీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాసారు. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో 30 ప్రశ్నలతో భట్టి లేఖ రాశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఎందుకు జరపడంలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకు పురోగతి లేదని భట్టి దుయ్యబట్టారు.

‘ మీ 9ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి..? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి..కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు..మీకు కేసీఆర్‎కున్న లోపాయికార ఒప్పందం ఏమిటీ..? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభ కోణాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులో పురోగతి ఎందుకు లేదు. మీకు కేసీఆర్‎కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు..గిరిజన యూనివర్సిటీ ఏమైంది’’ అని మోడీ కి లేఖలో భట్టి విక్రమార్క ప్రస్తావించారు.

ఇక భట్టి ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం విక్రమార్క పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.