ఓటిటిలోకి వచ్చేసిన రంగమార్తాండ

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ, అన‌సూయ‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన రంగమార్తాండ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తూ , చిత్ర యూనిట్ ను అభినందిస్తూ వచ్చారు.

ఈ సినిమాను నాటక రంగ నేపధ్యంలో.. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి భావనతో ఉన్నారనే వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేలా.. హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో కృష్ణవంశీ ఈ చిత్రాన్ని మలిచారు. సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ , కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేకపోయింది. ఈ తరుణంలో సినిమా ను ఎలాంటి ప్రచారం లేకుండా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేసారు.

‘రంగమార్తాండ’ చిత్రం ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ కూడా భారీ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.