టీటీడీలోని ఆరుగురు ఉద్యోగులపై వేటు

ఆర్జిత సేవా టికెట్ల విక్రయంలో అవకతవకలు

తిరుమల : ఆరుగురు టీటీడీ ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ టీటీడీ పరిధిలోని వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులపై పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 2006-08 మధ్య కాలంలో ఆర్జిత సేవా టికెట్లను ఇష్టం వచ్చినట్టు విక్రయించినట్టు వీరిపై ఆరోపణలున్నాయి.

తమ అనుకూల వ్యక్తులకు వస్త్రంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవా టికెట్లను 30 ఏళ్ల వరకు మొత్తం విక్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో 18 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/