ముగిసిన బండి సంజయ్ అమెరికా పర్యటన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు.

సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్ కరోలినాలోని చార్లెట్ ఎన్సీ, 5న రాలై, 6న వాషింగ్టన్ డీసీ, 7న న్యూయార్క్, 8న న్యూజెర్సీ, 9న డల్లాస్ లో, 10న ఫ్రిస్కో టెక్సాస్ ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా ఎన్నారైలు ముఖ్యంగా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజాస్యామ్య తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని ఈ సందర్బంగా సంజయ్ కోరారు. మరికాసేపట్లో బండి సంజయ్‌ ఢిల్లీకి చేరుకోనున్నారు.