బాబు రావాలి..రాష్ట్రం గెలవాలి..లోకేశ్ ఆసక్తికర ట్వీట్

lokesh

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ‘యుద్ధభేరి’ పర్యటనపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బాబు రావాలి.. రాష్ట్రం గెలవాలి అంటూ చంద్రయాన్ ప్రస్తావనతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

‘‘చంద్రయాన్! సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్..10 రోజులు…15 ప్రాజెక్టులు…20 జిల్లాలు…30 నియోజకవర్గాలు…35 ప్రజెంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు..3000 కిలోమీటర్లు…బెదిరింపులకు భయపడలేదు…రాళ్ళదాడులను లెక్కచేయలేదు…జలం కోసం…జనం కోసం…సాగునీటి కోసం…రైతు బాగుకోసం…నీళ్ల కోసం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రుడు. నాయుడే ప్రజా నాయకుడు! బాబు రావాలి…..రాష్ట్రం గెలవాలి’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.