నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ భేటీ

సాయత్రం 6.30 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో భేటీ

అమరావతి: సీఎం జగన్ నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటీపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/