జూన్ 15న అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ మాల్ ప్రారంభం

అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ మాల్ ను జూన్ 15 న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , మంత్రి తలసాని కలిసి ప్రారభించబోతున్నారు. ఈ ఏషియన్ సత్యం మాల్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉండనున్నారు.

ఈ మాల్ విశేషాలు చూస్తే..

మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్‌లో మూడు ఫ్లోర్ల పార్కింగ్ ఉండనుంది. ఏఏఏ ఫుడ్ కోర్ట్ మూడో ఫ్లోర్‌లోనూ, ఏఏఏ సినిమాస్ నాలుగో ఫ్లోర్‌లోనూ ఉండనున్నాయి. అలాగే ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నాయి. వీటిలో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తు ఉండనుంది. బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఉండనుంది. ఇది కూడా అట్మాస్ సౌండ్‌తోనే రానుంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్‌తో రానున్నాయి. డాల్బీ 7.1 సౌండ్ కూడా ఉండనుంది. జూన్ 16వ తేదీన విడుదల కానున్న ‘ఆదిపురుష్’ సినిమానే ఇందులో ప్రదర్శితం అయ్యే మొదటి చిత్రం కావడం విశేషం.