జగన్ సర్కార్ కు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల షాక్

ఏపీ సర్కార్ కు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని తీర్మానించాయి. బకాయిల విడుదల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది.

పేద రోగులకు భరోసా కల్పిస్తున్న అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఆయన ప్రారంభించిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల వారు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఆరోగశ్రీ సేవలు రేపటి నుంచి ఏపీలో బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ఆసుపత్రుల అసోసియేషన్ఆ రోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి లేఖ ద్వారా తెలియజేసింది.

బకాయిల విడుదల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈసేవలు నిలిపి వేస్తున్నట్లు ఆస్పత్రుల అసోషియేషన్ తెలిపింది. ఏపీలో ఆరోగ్యశ్రీ కింద ఏపీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బకాయిలు రాకపోవడంతో సేవలు నిలిపివేయాలని జిల్లాల వారీగా ఏకగ్రీవ తీర్మానానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆమోదం తెలిపాయి.