గాల్వన్ అమరవీరులకు నివాళి అర్పించిన భారత్ ఆర్మీ
లేహ్ : గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్లో గాల్వన్ అమరవీరులకు నివాళి అర్పించారు. భారతీయ సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ నివాళులు అర్పించింది. మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్ .. లేహ్లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పాలతో నివాళి అర్పించారు.
కాగా, గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/