ఇంట్లోనే వినాయక చవితిని జరుపుకోవాలి..ఏపి ప్రభుత్వం

వినాయక మండపాలకు అనుమతి నిల్..ఉత్తర్వులు జారీ

Ganesh

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించింది. గణేశ్ మండపాలకు అనుమతి ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. అంటే బహిరంగ ప్రదేశాల్లో సామూహిక పూజలు ఇక ఉండనట్టే. ఇక, గణేశ్ చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలు కోసం బయటకు వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. దేవాలయాల్లోనూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించాలని పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/