తెలంగాణలో కొత్తగా 1,724 కేసులు నమోదు

కరోనా కేసుల సంఖ్య మొత్తం 97,424

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 21,509 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన 1,724 పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 395 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 105, రంగారెడ్డిలో 169 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 24వేలకుపైగా పరీక్షలు చేయగా, మొత్తం 7.97లక్షలకు చేరాయని వివరించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/