రాజకీయల్లో ఒక్కోసారి పూలు పడుతుంటాయి, రాళ్లు పడుతుంటాయిః నారాయణస్వామి

చంద్రబాబు చొక్కా చించుకుని రోడ్డుపై పడేలా ఉన్నాడని విమర్శలు

deputy-cm-narayanaswamy

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు తన వ్యాఖ్యల్లో పదును పెంచుతూ, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులకు తీవ్ర హెచ్చరికలు చేయడం తెలిసిందే. నిన్న కర్నూలులో టిడిపి ఆఫీసు వద్ద వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు నినాదాలు చేస్తూ, తన కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. రండి చూసుకుందాం… మీ సంగతేంటో తేలుస్తా… రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను అంటూ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. చంద్రబాబు ఒక పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తీరు చూస్తుంటే వీధి రౌడీని తలపిస్తోందని అన్నారు.

రాజకీయల్లో ఒక్కోసారి పూలు పడుతుంటాయి, ఒక్కోసారి రాళ్లు పడుతుంటాయి… వాటిని స్వీకరించాలే తప్ప రండి కొట్టుకుందాం అని వ్యాఖ్యలు చేయడం సరికాదని నారాయణస్వామి హితవు పలికారు. చంద్రబాబు చొక్కా చించుకుని రోడ్లపై కాగితాలు ఏరుకునే స్థితికి చేరుకునేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తీరు కూడా ఇలాగే ఉందని నారాయణస్వామి అన్నారు. పవన్ లో రాజకీయనాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/