నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్
విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సీఎం
![‘Jagannanna Thodu’ scheme postponed](https://www.vaartha.com/wp-content/uploads/2022/02/AP-CM-YS-Jagan-Mohan-Reddy.jpg)
అమరావతీః సిఎం జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
బాపట్ల జిల్లా పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 10.10 గంటలకు బాపట్ల చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు తిరుగు పయనమవుతారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/