షర్మిల పాదయాత్రను అడ్డుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు

వైఎస్ షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రస్తుతం షర్మిల కొండగల్ నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కొండగల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. దీంతో ఈరోజు టిఆర్ఎస్ కార్య కర్తలు షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. దుద్యాల గ్రామంలో ఆమె పాదయాత్ర చేస్తుండగా.. స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు.

ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. ఇక ఈరోజు షర్మిల కొడంగల్‌లో ప్రజలతో ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో దుస్థితిపై మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో భోజనం సరిగా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారని ధ్వజమెత్తారు.