ప్రారంభమైన ఏపీ కేబినెట్..36 అంశాల‌పై కేబినెట్ లో చర్చ

కేబినెట్ భేటీలోనే మంత్రుల రాజీనామా?

అమరావతి: సీఎం జగన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం
స‌చివాల‌యంలో ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశమే కేబినెట్‌లోని 24 మంది మంత్రుల‌కు చివ‌రి కేబినెట్ స‌మావేశంగా ప‌రిగ‌ణిస్తున్న నేప‌థ్యంలో భేటీకి హాజ‌రైన మొత్తం 24 మంది మంత్రులు త‌మ వెంట ఖాళీ లెట‌ర్ హెడ్‌ల‌ను తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో నిర్దేశిత అజెండాపై చ‌ర్చ ముగియ‌గానే… మంత్రులంతా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే… ఈ భేటీలో మొత్తం 36 అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త‌గా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజ‌న్ల‌కు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. మ‌రోవైపు కొత్త‌పేట కేంద్రంగా మ‌రో కొత్త రెవెన్యూ డివిజ‌న్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెల‌ప‌నున్న‌ట్లుగా స‌మాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/