సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినేట్ ప్రారంభం

cm-jagan

అమరావతిః సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం అయింది. ఏపి అసెంబ్లీ సమావేశాలు..రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ముఖ్యంగా ఏపీ కేబినెట్ 49 అంశాల పై చర్చించనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. నేడు ఈ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరనుంది. UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం చేనుంది. అలాగే.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పై ఏపీ కేబినెట్ చర్చించనుంది. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ నిర్వహించనుంది.