‘గ్రేటర్’లో ఆందోళనకరంగా కరోనా వ్యాప్తి
వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
Hyderabad: గ్రేటర్పై కరోనా వైరస్ పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ ఎవరిద్వారా వ్యాప్తి చెందుతుందో అన్న భయం అందరిలో నెలకొంది.
అలాగే కాంటాక్టులను గుర్తించడం కూడా కష్టంగా మారింది. దీంతో గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నవెూదవుతూనే ఉన్నాయి.
చివరకు జిహెచ్ఎంసి, సచివాలయ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగుల్లో సైతం భయం నెలకొంది. దీంతో చాలామంది మళ్లీ విధులకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు నగరంలో మరోమారు పూర్తిస్థాయిలో లాకడౌన్ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
గ్రేటర్పరిధిలో పెరుగుతున్న కేసులతో లాకడౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
టెన్త్ పరీక్షలు కూడా పూర్తిగా రద్దు కావడంతో ఇక లాకడౌన్ విధించినా పెద్దగా సమస్యలు రావని అంటున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/