ఒకేరోజు నాల్గు సభల్లో పాల్గొనబోతున్న అమిత్ షా

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా..ఒకేరోజు నాల్గు సభల్లో పాల్గొనబోతున్నారు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తుంది. లోకల్ నేతలతోనే కాకుండా జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే మోడీ , అమిత్ షా లు ప్రచారంలో పాల్గొనగా…మరోసారి అమిత్ షా ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

ఈ మేరకు ఆయన పర్యటన కు సంబదించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 18 న అమిత్ షా..నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొనబోతున్నారు. అదే రోజున సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 17 న అమిత్ షా పర్యటించాల్సి ఉండగా..అది కాస్త 18 కి వాయిదా పడింది.