నా వెంట ఉంటారో..పవన్ వెంట ఉంటారో మీరే తేల్చుకోండి అంటూ కాపులపై అంబటి వ్యాఖ్యలు

వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు..కాపులపై కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ను నమ్ముకున్న తన వెంట ఉంటారో లేక చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ కల్యాణ్ వెంట ఉంటారో మీరే తేల్చుకోండి అంటూ కాపులను హెచ్చరించారు అంబటి. గత కొద్దీ రోజులుగా ఏపీ రాజకీయాలు పూర్తిగా మారాయి. ఇప్పటివరకు కాపులకు సీఎం ఛాన్స్ రాలేదని..ఈసారి పవన్ కళ్యాణ్ ను సీఎం చేసి కాపులుగా మన పేరు నిలుపుకోవాలని కాపులంతా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం పలు సభలు పెట్టి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

సీఎం జగన్ ను నమ్ముకున్న తన వెంట ఉంటారో లేక చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ కల్యాణ్ వెంట ఉంటారో మీరే తేల్చుకోండి అన్నారు. వైస్సార్సీపీ పార్టీ ని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారని… అంత మగాడా ఆయన? అని ప్రశ్నించారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కల్యాణ్ తన గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని… అందుకే పవన్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని అన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా… తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.