ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

మోడీకి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం జగన్

pm-modi-will-tour-visakha-on-november-11

అమరావతిః ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో 12న విశాఖలో పలు పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోడీ విశాఖ రానుండడం ఇది మూడోసారి.

తాజా పర్యటన సందర్భంగా, ప్రధానికి ఐఎన్ఎస్ డేగా వద్ద ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి మోడీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుంటారు. రాత్రికి ఐఎన్ఎస్ చోళాలో బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోడీ దాదాపు 14 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/