కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫై..మంత్రి తలసాని ఫైర్

బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. కనీసం ఆయన సికింద్రాబాద్ కు ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజలు ఎన్నుకుంది రాజకీయ విమర్శలు చేయడానికేనా,,? అని ప్రశ్నించారు. విమర్శల్లో కాదు… అభివృద్ధిలో పోటీపడండి అంటూ కిషన్ రెడ్డి కి తలసాని హితువు పలికారు.

సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తే ఇక కేసు లేనట్టే అనే విధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తలసాని విమర్శించారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సంబరాలు చేసుకోవడానికి న్యాయస్థానం ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా…? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంబంధం లేదంటారు… మళ్లీ వాళ్లే కోర్టుకు వెళతారు’ అంటూ తలసాని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.