పవన్ కళ్యాణ్ ఫై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి..

మంత్రి అంబటి రాంబాబు..మరోసారి పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నాల్గు రోజులుగా బ్రో సినిమా ఫై వరుస ట్వీట్స్ , మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పవన్ కళ్యాణ్ ఫై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రాంబాబు..తాజాగా పుంగనూరు ఘటన ఫై పవన్ స్పందిస్తే దానిని తప్పు పట్టారు.

చంద్రబాబు పుంగనూరు పర్యటన ఎలాంటి ఉద్రిక్తల నడుమా సాగిందో చెప్పాల్సిన పనిలేదు. చంద్రభాను పర్యటన ను అడ్డుకున్న వైస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు ఫై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అలాగే పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. ఈ ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిందించారు. పుంగనూరులో జరిగిన పరిణామాలు అధికార పార్టీ హింసా ప్రవృత్తిని చాటేలా ఉన్నాయని పవన్ విమర్శించారు.

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని అంబటి ఖండించారు. “కానిస్టేబుల్ కొడుకువై ఉండి, పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో!” అంటూ పవన్ ను అంబటి ప్రశ్నించారు.