‘ధీర’ గా రాబోతున్న అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ ఖాతాలో మరో ప్లాప్ పడింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో నటించిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ ఫై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ , వారి ఆశల ఫై నీళ్లు చల్లింది. ప్రస్తుతం అఖిల్ ..యువి క్రియేషన్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ ని రాధే శ్యామ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ డైరెక్టర్. అంతే కాదు ఈ సినిమాకు ధీర అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

అఖిల్ కు ఇది ఆరో చిత్రం. అయితే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలనాటి అందాల తార శ్రీదేవి బోనీ కపూర్ ల కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో అఖిల్ సరసన నటించనున్నారట. ప్రస్తుతం ఈెమె కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తోంది. అయితే ఆ సినిమా పూర్తవగానే అఖిల్ సినిమాలోనే చేస్తుందని సమాచారం.