ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ ప్రారంభం

2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌పై ట్ర‌య‌ల్స్

న్యూఢిల్లీ: నేటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పిల్లలపై కరోనా టీకా కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌పై ఈ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందు కోసం తాము 18 మంది చిన్నారుల‌ను ఎంపిక చేశామ‌ని ఢిల్లీ ఎయిమ్స్ వ‌ర్గాలు తెలిపాయి.

కరోనా మూడో ద‌శ ప్ర‌భావం చిన్నారుల‌పై అధికంగా ఉంటుందన్న అంచనాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌ల‌కు డీజీసీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి‌కీ వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేద‌న్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అమెరికా, కెనడా, జపాన్‌, చైనా వంటి పలు దేశాలు త‌మ దేశాల్లో పిల్లలకు టీకాలు వేసేందుకు అనుమతులు ఇచ్చాయి. ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్‌, వ్యాక్సిన్‌, స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లు ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే వేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/