యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ ఈరోజు గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేకంటే ముందు యాదగిరిగుట్టకు వచ్చి తెలంగాణ వస్తే నర్సన్నకు ప్రత్యేక పూజలు చేస్తామని మొక్కుకున్నామని.. అదేవిధంగా ప్రజలు పూజలు పూజిస్తున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట నర్సన్న ఆలయాన్ని అద్భుతంగా నిర్మించినందుకు సీఎం కేసీఆర్ కు గద్దర్ ధన్యవాదాలు చెప్పారు.

శిల్పకళా సముదాయంతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో విహరించిన అనుభూతి కలుగుతోందని గద్దర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. భగవంతుడు, ప్రకృతి అంటే ఒక ప్రశాంతతను కలిగించేవి.. అలాంటి ప్రశాంతత ఇక్కడ దొరుకుందని గద్దర్ అన్నారు.