హాస్పటల్ లో చేరిన పూరి హీరోయిన్

పూరి డైరెక్షన్లో హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన అదాశర్మ..అనారోగ్యం తో హోస్పేట్ల్ లో చేరింది. తీవ్ర డ‌యేరియా, ఫుడ్ అల‌ర్జీతో ఆమె బాధపడుతూ హాస్పటల్ లో చేరింది. ప్ర‌స్తుతం ఆదా శ‌ర్మ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని, ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్టర్స్ తెలిపారు.

హార్ట్ అటాక్ మూవీ తో తెలుగు లో అడుగుపెట్టిన అదా..ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , గరం, క్షణం వంటి సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం ప్లాప్ అవ్వడం తో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తుంది.