సీనియర్ నటి రాధ కూతురు పెళ్లికి సిద్దమైందా..?

సీనియర్ నటి రాధా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితరాలే. చిరంజీవి ,నాగార్జున , బాలకృష్ణ ఇలా స్టార్ నటులతో సినిమాలు చేసి అలరించింది. ఆమె కూతురు కార్తీక సైతం నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా భారీ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత చేసిన రంగం మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఈ భామకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. తెలుగులో అల్లరి నరేష్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కార్తీ కి ఛాన్సులు రాకుండా అయిపోయాయి.

ప్రస్తుతం ఈమె పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈమె ఎంగేజ్మెంట్ పూర్తయింది అంటూ తమిళనాట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కార్తీక ఇంస్టాగ్రామ్లో ఓ క్రేజీ పోస్ట్ ను పెట్టింది. కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో తన వేలికి ఉన్న రింగ్ కూడా హైలైట్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. దానితో కార్తీక నిశ్చితార్థం చేసుకుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.వరుడి ఎవరు అంటూ నెటిజన్లు ఆరా తీయడం కూడా ప్రారంభించారు. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.