ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్న సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ

న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ నేటి సాయంత్రం 5గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంతో పాటు, బెంగాల్ అభివృద్ధిపై మోడీతో చ‌ర్చించ‌నున్నారు. ఇటీవల బెంగాల్లో బీఎస్ఎఫ్ జ్యూరిడిక్షన్ పెంపు అంశంపై టీఎంసీ పార్టీ గుర్రుగా ఉంది. పంజాబ్, అస్సాం, పశ్చిమబెంగాల్ లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎవరి అనుమతులు లేకుండా బీఎస్ఎఫ్ చర్యలు తీసుకోవచ్చు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, బంగ్లాదేశ్‌తో పశ్చిమ బెంగాల్ సరిహద్దులు పూర్తిగా శాంతియుతంగా ఉన్నాయని మమతా బెనర్జీ ఇటీవల తెలిపారు. ఈ మేర‌కు ఈ అంశంపై కూడా ఆమె చ‌ర్చించే ఛాన్స్ ఉంది.

కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మొద‌టిసారిగా దీదీ తొలిసారిగా ఢిల్లీకి వ‌చ్చారు. ఈ నెల 29నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌కు ముందు ఆమె రాక రాజ‌కీయంగా ఆస‌క్త‌ని రేపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/