దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలంటూ వైస్సార్సీపీ కి అచ్చెన్న సవాల్

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు అంశం వాడివేడిగా నడుస్తుంది. టీడీపీ – వైస్సార్సీపీ నేతలు ఇరువురు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా తాము రాజీనామా చేస్తామని, రాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ వైస్సార్సీపీ నేతలు డిమాండ్ చేయడం పట్ల అచ్చెన్నాయుడు స్పందించారు.

ఉత్తరాంధ్రను కబళించేందుకు రాబందులు వస్తున్నాయంటూ వైస్సార్సీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలను కొట్టేశారని, విశాఖలో భూదోపిడీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అజెండాపై జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల అజెండాపై వైస్సార్సీపీ.. అమరావతే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళ్థామని సూచించారు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ల వాదనకు ఆమోదం లభించినట్లేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.