మహారాష్ట్రల్లో ఒక్కరోజే 7,924 కొత్త కేసులు

గ‌డ‌చిన‌ 24 గంటల్లో 227 మంది మృతి

maharashtra-corona cases

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. సోమవారం రాష్ట్రంలో కొత్త‌గా 7,924 క‌రోనా కేసులు నమోదయ్యాయి. గ‌డ‌చిన‌ 24 గంటల్లో 227 మంది మృతిచెందారు. అయితే ఒక్క‌రోజులో 8,706 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావ‌డం విశేషం. ఆరోగ్య‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3,83,723 కు పెరిగింది, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మొత్తం 13,883 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,21,944 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 57.84 శాతానికి చేరుకుంది. అదే సమయంలో మరణాల రేటు 3.62గా ఉంది. ప్రస్తుతం మ‌హారాష్ట్ర‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,592. కాగా ముంబైలో కరోనా కార‌ణంగా మృతిచెందిన‌వారి సంఖ్య సోమవారం కాస్త తగ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 129 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన పూణే డివిజన్‌లో గడ‌చిన‌ 24 గంటల్లో 52 మంది మృతి చెందారు. క‌రోనా నుంచి 2,354 మంది కోలుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/