శబరిమలకు వెళ్తూ లోయలో పడిన ఏపీ భక్తుల బస్సు

శబరిమలకు వెళ్తున్న ఏపీకి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. పతనంథిట్ట సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు తెలుస్తుంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

శబరిమలలో మణికంఠుడి దర్శనాలు ఈ బుధవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.. ఈ ఏడాది అన్ని కొవిడ్‌ ఆంక్షలను తొలగించింది. అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంబా నది భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది.