కాకినాడ జిల్లాలో వణికిస్తున్న డయేరియా

,

మరోసారి కాకినాడ జిల్లాలో డయేరియా వణికిస్తోంది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగనా వందకు పైగా డయేరియా బారినపడి హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలో గ్రామంలో డయేరియా భయభ్రాంతులను చేస్తుంది. గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలు, జ్వరం తో 100 మంది కి పైగా గ్రామస్తులు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.

గ్రామంలో మొత్తం జనాభా 2000 మంది వరకు ఉండగా.. మూడు రోజులు గా వాంతులు, విరేచనాలు, జ్వరం తో 100 మంది కి పైగా గ్రామస్తులు బాధపడుతోన్నారు. గ్రామం లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి కలుషితమైన తాగునీరు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. దీంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది, హెల్త్ కిట్లు పంపిణి చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ల లో చికిత్స పొందుతున్నారు.