కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
స్వచ్ఛందంగా దుకాణాలు మూత
Vijayawada: ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా స్వచ్ఛందంగా దుకాణాలు మూశారు.
మహమ్మారిని అంతమొందించటమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛందంగా ప్రజలు ఈ జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు.కృష్ణా జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా జరుగుతోంది.
క్కయ్యపాలెం జాతీయ రహదారి కూడలిలో 4వ పట్టణ ట్రాఫిక్ పొలీసులు కరోనా వైరస్ విషయమై మాస్కులు పెట్టుకోవసిందిగా వాహన దారులకు అవగహన కల్పిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలూ మూతపడ్డాయి. వాహనాలు రోడ్లమీద కనిపించడం లేదు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం : https://epaper.vaartha.com