దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో భారత్ లో 975 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు కొత్త కేసుల సంఖ్య 949గా ఉంది. ఇదే సమయంలో 796 మంది కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే… నిపుణులు అంచనా వేసిన విధంగా మరో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.

మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 4,25,07,834 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 186.38 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగింది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 4,30,39,972 కేసులు నమోదయ్యాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/