దేశంలో కొత్త‌గా 7,145 క‌రోనా కేసులు

మృతుల సంఖ్య మొత్తం 4,77,158కు

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా7,145 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. అలాగే, ఒక్క‌రోజులో 8,706 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న దేశంలో 289  మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 569 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో  84,565 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి ఇప్ప‌టికే వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,41,71,471కు పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 4,77,158కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం వినియోగించిన‌ వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 136,66,05,173కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/