భారత్‌లో కొత్తగా 69,921 కేసులు నమోదు

మొత్తం కేసులు 36,91,167

coronavirus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా బీభత్సం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 69,921 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 819 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 36,91,167కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 65,288 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 28,39,883 మంది కోలుకున్నారు. 7,85,996 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,33,24,834 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,16,920 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్త కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/