పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు బినామీ – వైసీపీ నేత శంకర్ నారాయణ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు బినామీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ నేత శంకర్ నారాయణ. పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఫై శంకర్ నారాయణ పలు వ్యాఖ్యలు చేసారు. చనిపోయిన రైతు కుంటుంబాలకు జగన్ సర్కార్ ఇప్పటికే రూ. 7 లక్షల చొప్పున సాయం చేశారని ..అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అసలు పవన్ కళ్యాణ్ కు కౌలు రైతుల గురించి ఏం తెలుసు అని విమర్శించారు. రైతు యాత్ర అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. 469 మంది రైతులకు చంద్రబాబు చిల్లిగవ్వ సాయం కూడా సాయం చేయలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఓ పార్ట్ టైం రాజకీయ నాయకుడని, ఖాళీ సమయాల్లో రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసనీ అన్నారు.
పవన్ కళ్యాణ్.. రైతు యాత్ర అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్ర బాబు హాయంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అప్పుడు చంద్ర బాబు సాయం చేశారా.. అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఓ పార్ట్ టైం రాజకీయ నాయకుడని విమర్శించారు. సినిమాలు చేస్తున్నప్పుడు.. ఖాళీ సమయాల్లో రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.