దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు

మృతుల సంఖ్య మొత్తం 4,77,554

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 572 రోజుల క‌నిష్ఠానికి త‌గ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 82,267 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికి‌త్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,77,554కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/