దేశంలో కొత్త‌గా 6,561 క‌రోనా కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతం

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 6,561 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 142 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 14,947 మంది కోలుకున్నారని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 77,152 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపింది.

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,53,620గా ఉంద‌ని వివ‌రించింది. దేశంలో మొత్తం 178.02 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేసిన‌ట్లు తెలిపింది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/