ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..6 గురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీతంపుర ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగు సజీవదహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన ఆరుగురు రెండుకుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

భవనం మొదటి అంతస్తులో తొలుత మంటలు చెలరేగి మూడు ఫ్లోర్లను ఆక్రమించాయి. అయితే మంటలతో చెలరేగిన పొగతోనే ఊపిరాడక కొందరు మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతిచెందిన ఆరుగురిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా ముప్పయి నుంచి అరవైఏళ్ల వయసులోపు వారే. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.