భారత్‌లో కొత్తగా 55,079 మందికి కరోనా

మృతుల సంఖ్య మొత్తం 51,797

corona virus – india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797 కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 3,09,41,264 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/