లోయలో పడిన మినీ బస్సు.. 9 మంది దుర్మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించారని పలువురు గాయపడ్డారని నిర్ధారించారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/